కుమారి ఆంటీ హోటల్ ఓపెన్.. ఎగబడిన జనం

కుమారి ఆంటీ హోటల్ ఓపెన్.. ఎగబడిన జనం

కుమారి ఆంటీ హోటల్ ఓపెన్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసుల తొలగింపుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో.. ప్రభుత్వం స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించి.. పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసుల పర్మీషన్ తో.. జనవరి 31వ తేదీ మధ్యాహ్నం హోటల్ ఓపెన్ చేసింది కుమారి ఆంటీ.. ఈ విషయం తెలుసుకున్న జనం.. భోజనం చేసేందుకు ఎగబడ్డారు. వందల సంఖ్యలో ఫుడ్ కోసం తరలివచ్చారు.

 కుమారి ఆంటీకి మద్దతు పలికారు. కుమారి ఆంటీ హోటల్ మళ్లీ తెరిచారు అన్న విషయం తెలిసిన వెంటనే.. రోజుకు కంటే ఎక్కువగా జనం తరలి వచ్చారు. డీజీపీ ఆదేశాలతో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ షాపును సందర్శించనున్నారు.  షాపు రీ ఓపెన్ కావడంతో కుమారీ ఆంటీ సంతోషం వ్యక్తం చేసింది.