చివరి వన్డే: టీమిండియాలో మార్పులుంటాయా!

చివరి వన్డే: టీమిండియాలో మార్పులుంటాయా!

ఆసీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారీ స్కోరు సాధించినప్పటికీ టిమిండియా ఓడిపోయింది. ప్రపంచకప్‌ ముందు యువ ఆటగాళ్లను పరీక్షించాలని భావించి జట్టు యాజమాన్యం ప్రయోగాలు చేసింది. ఈ క్రమంలో రాంచీతో మ్యాచ్‌ తర్వాత వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనికి విశ్రాంతినిచ్చి అనూహ్యంగా రిషబ్‌ పంత్‌కు చోటిచ్చారు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పంత్‌కు మద్దతుగా నిలిచాడు. ధోనితో పంత్‌ను పోల్చడం సరికాదన్నాడు. ఏదేమైనా నాలుగో వన్డేలో పంత్‌ తప్పిదాలకు టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో పంత్‌ను విమర్శిస్తూ అభిమానులు తెగ ట్రోలింగ్‌ చేస్తున్నారు.రేపు ( మంగళవారం) మొహాలీలో జరిగే ఐదో వన్డేలో ఆసీస్‌ పై మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
టీమిండియా జట్టు:
ఐదో వన్డేలో శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, విజయ్ శంకర్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రిత్‌ బుమ్రా కు స్థానం లభించే అవకాశం ఉంది.