లంక బోర్డుపై సస్పెన్షన్‌‌ ఎత్తివేత

లంక బోర్డుపై సస్పెన్షన్‌‌ ఎత్తివేత

దుబాయ్‌‌: శ్రీలంక క్రికెట్‌‌ బోర్డు (ఎస్‌‌ఎల్‌‌సీ)కి భారీ ఊరట దక్కింది. ఆ దేశ బోర్డుపై విధించిన సస్పెన్షన్‌‌ను ఐసీసీ ఎత్తి వేసింది. గత రెండు నెలల నుంచి లంక బోర్డు పరిస్థితులను నిశితంగా పరిశీలించిన ఇంటర్నేషనల్‌‌ బాడీ రాజకీయ జోక్యం లేదని నిర్ధారించుకుంది.

గతేడాది నవంబర్‌‌ 10న సస్పెన్షన్‌‌ వేటు వేయడంతో అండర్‌‌–19 వరల్డ్‌‌ కప్‌‌ ఆతిథ్య హక్కులను లంక కోల్పోయింది. ఈ క్రమంలో 2026 టీ20 వరల్డ్‌‌ కప్‌‌ రైట్స్‌‌ కూడా చేజారుతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు సస్పెన్షన్‌‌ తొలగిపోవడంతో లంక బోర్డు యధావిధిగా ఇంటర్నేషనల్‌‌ షెడ్యూల్స్‌‌ను మొదలుపెట్టనుంది.