
- మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం!
- ఏ ఎన్నికలు ముందు నిర్వహించాలన్నదానిపై కేబినెట్లో చర్చించి డెసిషన్ఎం
- పీటీసీలు ముందా..? సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడనేది త్వరలో క్లారిటీ
హైదరాబాద్: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికలకు ఒక అడుగు ముందుకు పడింది. ఇవాళ నిర్వహించిన మంత్రుల సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. జులైలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా..? లేదా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టి తర్వాత పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలా..? అన్నదానిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ కీలక అంశాలపై చర్చ జరిగింది.
ALSO READ | కాంగ్రెస్కు వ్యవసాయానికి విడదీయరాని సంబంధం: భట్టి విక్రమార్క
ప్రధానంగా రైతుభరోసా, స్థానిక సంస్థల ఎన్నికలపైనే డిస్కషన్ జరిగింది. ఇవాళ్టి సమావేశంలో స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం వెలువడనుందని అంతా భావించారు. అనుకున్నట్టుగానే నిర్ణయం వెలువడినా ఏ ఎన్నికలు ముందుగా నిర్వహిస్తారనేది కేబినెట్ సమావేశంలోనే తేల్చే అవకాశం ఉంది.
ఎన్నికల సన్నద్ధతను సీఈవో కు తెలియజేస్తే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేస్తుంది. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి. ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఓటర్లు ఎన్నుకుంటారు. ఎన్నికైన ఎంపీటీసీలు మండల పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అలాగే జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ ను ఎన్నుకుంటారు.
పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే.. ఓటర్లు వార్డు సభ్యులకు, సర్పంచ్ కు నేరుగా ఓటు వేస్తారు. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. ఇండిపెండెంట్ గుర్తులపైనే ఎన్నికలు జరుగుతాయి. వార్డు సభ్యులు ఉపసర్పంచ్ ను ఎన్నుకుంటారు. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కనుంది.