లోక్ సభ స్పీకర్ కు కరోనా.. ఎయిమ్స్ కు తరలింపు

లోక్ సభ స్పీకర్ కు కరోనా.. ఎయిమ్స్ కు తరలింపు

కరోనా మళ్లీ పంజా విసురుతోంది. గత మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు లక్షదాటాయి. పార్లమెంట్ లోనూ కరోనా కలకలం రేపుతోంది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ నెల 19న కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఆయనను 20న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలోని కోవిడ్ సెంటర్ లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.