యువకుని హత్య కేసులో నలుగురి అరెస్ట్

యువకుని హత్య కేసులో నలుగురి అరెస్ట్

ఖానాపూర్, వెలుగు:  ఖానాపూర్  మండలం  సూర్జాపూర్​లో ఈ  నెల 20 రాత్రి  రాచర్ల  అనిల్ కుమార్ అలియాస్  తిరుమలేశ్​ (23) ను  హత్య  చేసిన  నలుగురిని   పోలీసులు సోమవారం ఉదయం  అరెస్ట్ చేసి రిమాండ్ కు  పంపారు. కేసు వివరాలను  నిర్మల్  డీఎస్పీ  ఉపేందర్ రెడ్డి  వెల్లడించారు. సూర్జాపూర్  గ్రామానికి  చెందిన  గాజుల నాగరాజు కూతురిని  లవ్​ చేయాలంటూ కొంతకాలంగా తిరుమలేశ్​ వేధింపులకు గురిచేశాడని, ఈ  విషయం తెలిసి నాగరాజు, ఆయన  చిన్నాన్నలు  గాజుల రాజన్న, గాజుల గంగన్న  తిరుమలేశ్ మందలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. అయిన  అతనిలో  మార్పు రాకపోవడంతో  దాడి చేశారని, తిరుమలేశ్​ తనపై జరిగిన దాడి గురించి  ఫిర్యాదు  చేయగా  కేసు కూడా నమోదయ్యిందన్నారు. తమ కూతురిని వేధించడమే కాకుండా తమపైనే పోలీసులకు కంప్లైంట్​ చేశాడన్న కోపంతో నాగరాజు,  గాజుల రాజన్న, గాజుల గంగన్నలతో పాటు మరో  సమీప బంధువు,  నేవీ ఉద్యోగి  గాజుల నవీన్ ఈ నెల 20న  తిరుమలేశ్​ను  ఇంటి నుంచి  బయటకు  తీసుకు వెళ్లారని,  చౌరస్తా వద్దకు  తీసుకు వచ్చి, అతన్ని కట్టేసి గొడ్డలితో తలపై దాడి చేశారని,  చితకబాది  పారిపోయారని వివరించారు.   తీవ్రంగా గాయపడిన  తిరుమలేశ్​ను  ఖానాపూర్​కు, అక్కడి నుంచి  నిర్మల్ కు తీసుకెళ్లారని, చికిత్స పొందుతూ  చనిపోయడని చెప్పారు.  మృతుని తల్లి  రాచర్ల లక్ష్మీ ఫిర్యాదుతో  కేసు నమోదు చేసుకున్నట్టు, నిందితులు గాజుల నాగరాజు, గాజుల రాజన్న, గాజుల గంగన్న, గాజుల నవీన్​ మెట్ పల్లి  నుంచి వస్తుండగా  బాదనకుర్తి చెక్ పోస్టు  వద్ద పట్టుకున్నట్టు తెలిపారు. సీఐ అజయ్ బాబు, ఎస్ ఐ రాము నాయక్ ఉన్నారు.