
ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జయింట్స్ తమ చివరి మ్యాచ్ లో బ్యాటింగ్ లో అదరగొట్టింది. లక్నో వేదికగా మంగళవారం (మే 27) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ సీజన్ లో తొలిసారి విజృంభించిన రిషబ్ పంత్ సెంచరీతో (61 బంతుల్లో 118: 11 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగడంతో పాటు సూపర్ ఫామ్ లో ఉన్న మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67:4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, తుషార, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జయింట్స్ కు మంచి ఆరంభం లభించలేదు. మూడో ఓవర్లో బ్రీట్జ్కేకు వికెట్ తీసి బ్రేక్ ఇచ్చాడు. ఈ దశలో పూరన్ కాకూండా పంత్ అనూహ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ తో పాటు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ముందుగా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ పవర్ ప్లే తర్వాత ఒక్కసారిగా జూలు విదిల్చారు. దీంతో పవర్ ప్లే లో 55 పరుగులు చేసిన లక్నో 10 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 100 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
ఈ క్రమంలో 10 ఓవర్లో పంత్ 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు 13 ఓవర్లో మిచెల్ మార్ష్ 31 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. వీరిద్దరూ క్రీజ్ లో కుదురుకోవడంతో లక్నో భారీ స్కోర్ దిశగా పయనించింది. ఎట్టకేలకు ఈ జోడీని 16 ఓవర్ మూడో బంతికి భువనేశ్వర్ కుమార్ విడగొట్టాడు. రెండో వికెట్ కు 152 పరుగుల భాగస్వామ్యం తర్వాత మార్ష్ 67 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. చివర్లో పూరన్ సహకారంతో పంత్ 55 బంతుల్లో పంత్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Lucknow Super Giants posted a mammoth total against Royal Challengers Bengaluru 🏏
— InsideSport (@InsideSportIND) May 27, 2025
Can RCB chase it down to qualify for Qualifier 1? 🤔#IPL2025 #LSGvsRCB #RishabhPant #MitchellMarsh #CricketTwitter pic.twitter.com/bFp7uVLpQO