మాజీ ముఖ్యమంత్రి సోదరుడు దారుణహత్య

మాజీ ముఖ్యమంత్రి సోదరుడు దారుణహత్య
  •  భార్య సుమన్ (65) కూడా చంపేసిన దుండగులు

నోయిడా: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ భీష్మాచార్యుడు కమల్ నాథ్ కు వరుసకు సోదరుడు, అతని భార్య దారుణ హత్యకు గురయ్యారు. కమల్ నాథ్ కు వరుసకు తమ్ముడైన నరేంద్రనాథ్ (70), ఆయన భార్య సుమన్ (65) కూడా తమ ఇంట్లోనే చనిపోయి ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ భార్యా భర్తలిద్దరూ తమ నివాసంలోనే చనిపోయి పడి ఉండడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. హత్య చేసి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న రాత్రి జరిగిన పార్టీలో వాగ్వాదం.. వీరి మృతికి సంబంధం ఉంటుందని అనుమానాలు చెలరేగుతున్నాయి. నరేంద్రనాథ్ ఢిల్లీలో స్పేర్ పార్ట్స్ వ్యాపారంతోపాటు ఫైనాన్స్ బిజినెస్ కూడా చేస్తుండగా.. ఆయన భార్య సుమన్ ఒక స్వచ్ఛంద సంస్థలో యోగా టీచర్ గా పనిచేస్తున్నారు. తెల్లవారుజామున వీరి ఇంట్లో పనిచేసే సిబ్బంది వచ్చి చూడగా.. నరేంద్రనాథ్ ఇంటి సెల్లార్లో బట్టల కుప్ప దగ్గర చనిపోయి ఉండగా.. ఈయన భార్య సుమన్ మొదటి అంతస్తులో రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వచ్చి విచారణ చేపట్టారు. నరేంద్రనాథ్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ తోపాటు చుట్టు పరిచయం ఉన్న వారందరికీ వడ్డీకి ఫైనాన్స్ ఇచ్చేవాడని.. స్థానికులు చెబుతున్నారు. తన ఇంటి సెల్లార్ లోనే తన పరిచయస్తులతో తరచూ పార్టీలు జరుపుకోవడం నరేంద్రనాథ్ అలవాటు అని.. హత్య జరిగిన రాత్రి కూడా పార్టీ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సెల్లార్ లో మద్యం సీసాలు, గ్లాసులు, సగం తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలు, సిగరెట్లు కూడా పడి ఉండడంతో పొట్లాట జరిగి హత్య చేసి ఉంటారని తెలుస్తోంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన నరేంద్రనాథ్ భార్య సుమన్ ను కూడా దారుణంగా హత్య చేసినట్లు అంచనా వేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు.. నిందితులను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

For More News..

మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్‌పై ఈసీ సీరియస్.. భయపడొద్దంటూ అధికారులకు అభయం

ట్రూత్ ఆర్ డేర్.. నగ్న వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసిన తోటి విద్యార్థి

ర్యాగింగ్ చేసిన నలుగురు అమ్మాయిలకు ఐదేళ్ల జైలు

108 అంబులెన్స్‌లో సరైన వైద్యం అందక.. పసికందు మృతి