మోడీ మళ్లీ వస్తాడు: రాంచందర్ రావు

మోడీ మళ్లీ వస్తాడు: రాంచందర్ రావు

ఉప్పల్, వెలుగు: ప్రతిపక్షాలు ఏకమై మోడీని ఓడించాలని చూస్తున్నాయని, అది జరగని పని అని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. ఉప్పల్, చిలుకానగర్లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ తో కలిసి ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారుకు ఓటేస్తే బేకారేనని, దేశభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. కార్యకర్తలు మోడీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మరోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు.కూకట్ పల్లి: బీజేవైఎం ఇన్ అసోసియేషన్ విత్ ప్రొనమో, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి విజిత్ ఆధ్వర్యంలో ఐడీఎల్ చెరువు వద్ద ఆదివారం 2 కె రన్నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులుమాధవరం కాంతారావు, బీజేపీ మల్కాజిగిరిఅభ్యర్థి ఎన్.రాం చందర్ రావు పాల్గొన్నారు.