దళిత గిరిజనులందరికీ దళితబంధు ఇవ్వాలి

దళిత గిరిజనులందరికీ దళితబంధు ఇవ్వాలి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత గిరిజనులందరికీ ఇంటింటికీ  దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు మల్కాజ్‌గిరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెబ్బ వాసు. ఆనంద్ బాగ్ చౌరస్తా లో దళిత గిరిజన సత్యాగ్రహ దీక్షను చేపట్టారు.. ఈ సందర్భంగా  మాట్లాడుతూ .. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో దళిత గిరిజన కుటుంబాలకు కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున అందించాలన్నారు. లేకుంటే అందరూ కూడా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఉప ఎన్నికలు వస్తే  ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుంది కాబట్టి అందరూ  ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లాలన్నారు.