స్టూడెంట్‌పై అత్యాచారం.. కాలేజీ ఎదుట విద్యార్థుల ధర్నా

స్టూడెంట్‌పై అత్యాచారం.. కాలేజీ ఎదుట విద్యార్థుల ధర్నా

మేడ్చల్ లో మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బీటెక్ విద్యార్థిని పై ల్యాబ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడిన ఘటనకు నిరసనగా ధర్నా నిర్వహించారు. నిందితుడు వెంకటయ్యను కఠినంగా శిక్షించాలని ఆందోళన చేశారు విద్యార్థులు. భాదితురాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  వెంకటయ్య గతంలో కూడా చాలా మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు విద్యార్థులు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అడ్డుకున్నారు పోలీసులు.

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో అసలేం జరిగింది

పేట్ బషీరాబాద్‌కు చెందిన ఓ యవతి (19) మేడ్చల్‌ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోంది. కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ల్యాబ్‌కి పిలిచి తలుపులు వేసి బలవంతంగా అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకుని ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రి తరలించారు.