భార్యాభ‌ర్త‌ల పంచాయతీ చేస్తున్న మాజీ సర్పంచ్‌పై క‌త్తితో దాడి

భార్యాభ‌ర్త‌ల పంచాయతీ చేస్తున్న మాజీ సర్పంచ్‌పై క‌త్తితో దాడి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లాలోని గ‌ణ‌పురం మండ‌లం క‌ర్క‌ప‌ల్లి గ్రామంలో దారుణం జ‌రిగింది. ఓ దంపతులకి సంబంధించి పంచాయ‌తీ నిర్వ‌హిస్తున్న ఆ గ్రామ మాజీ స‌ర్పంచ్ పై ఓ వ్య‌క్తి క‌త్తితో విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేశారు. ఈ దాడిలో అత‌నికి తీవ్ర గాయాల‌య్యాయి. పంచాయితీ చేస్తున్న మాజీ సర్పంచ్ పెంచల రవీందర్ పై అదే గ్రామానికి చెందిన బింగి నరేష్ గౌడ్ కత్తితో దాడి చేయ‌డంతో అత‌ని శ‌రీరంపై మూడు చోట్ల తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో హుటాహుటిన గ్రామస్తులు ర‌వీంద‌ర్ ని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఘటనా స్థలం వద్ద విచారణ చేపడుతున్నారు.