- వరద కాల్వలో వ్యక్తి గల్లంతు
ఇబ్రహీంపట్నం, వెలుగు: జనం కళ్లెదుటే వరద కాల్వలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. జగిత్యాల జిల్లా రాజేశ్వర్రావుపేట శివారులోని వరదకాల్వ బ్రిడ్జిపై ఓ వ్యక్తి బుధవారం సాయంత్రం ఫోన్మాట్లాడుతూ నిల్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదకాల్వలో దూకాడు. గమనించిన స్థానికులు అక్కడ గుమిగూడారు. వరదకాల్వలో నీరు అధికంగా ఉండడంతో దూకిన వ్యక్తి అప్పటికే మునుగుతూ తేలుతూ చుట్టుపక్కల వారికి కనిపించాడు. తనను కాపాడాలని అతడు వేడుకున్నప్పటికీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో జనం ఎవరూ ముందుకు రాలేదు. కొద్దిసేపటికే అతడు కాల్వలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ వ్యక్తికి సంబంధించిన టీఎస్16ఈఎన్6223 నంబర్ గల బైక్ బ్రిడ్జిపై ఉండడంతో దాని ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు ఆరా తీశారు. బైక్కటకం గంగాధర్, నిజామాబాద్ జిల్లా రాంచంద్రాపూర్ అనే వ్యక్తిదని తెలిసింది. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.