వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి..!

వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి..!

హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్లో దారుణం జరిగింది. చిన్న సర్జరీ కోసం వచ్చిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బండ్లగూడకు చెందిన రవీందర్ కుమార్ (44) కు హెర్నియా ట్రీట్ మెంట్ కోసం 13 రోజుల క్రితం హాస్పిటల్ కు వచ్చాడు. డాక్టర్లు సర్జరీ చేయాలని చెప్పడంతో  ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే హెర్నియా సర్జరీ అనంతరం రవీందర్ చనిపోవడంతో కామినేని హాస్పిటల్ యాజమాన్యం కుటుంబసభ్యులకు చెప్పకుండానే డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించింది. దీంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. జూనియర్ డాక్టర్లతో సర్జరీ చేయించడం, మత్తు మందు డోస్ ఎక్కువ కావడంతోనే రవీందర్ చనిపోయాడని ఆరోపిస్తున్నారు. పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ట్రీట్ మెంట్ ఇచ్చి వ్యక్తి ప్రాణాలు తీసిన కామినేని హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని మృతుని బంధువులు కోరుతున్నారు.