మావోల ఘాతుకం.. టీఆర్ఎస్ నేత దారుణ హత్య

మావోల ఘాతుకం.. టీఆర్ఎస్ నేత దారుణ హత్య

ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకం సృష్టించారు. వెంకటాపురం మండలంలో అర్థరాత్రి టీఆర్ఎస్ నేత మాడూరి భీమేశ్వర్ రావును దారుణంగా  హత్య చేశారు. ఇన్ఫార్మర్ పేరుతో భీమేశ్వర్ రావు ను హత్య చేశారు.  అర్థరాత్రి భీమేశ్వరరావు ఇంటికి వచ్చిన  20మంది మావోయిస్టులు అందరూ చూస్తుండగానే కొట్టి చంపారు.  టీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని లేకపోతే వాళ్లకు ఇదే గతి పడుతుందని లెటర్ వదిలి వెళ్లారు. భీమేశ్వరరావు స్థానికంగా పురుగుల మందుల వ్యాపారం  చేస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.  ఐదురోజుల క్రితమే వెంకటాపురంలోడీజీపీ, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు  పర్యటించారు.

హత్యపై స్పందించిన ములుగు ఎస్పీ.. సామాన్య ప్రజలపై మావోయిస్టుల హత్యాకాండ కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టులకు పార్టీ ఫండ్ ఇవ్వనందుకే  భీమేశ్వరరావును హత్య చేశారన్నారు.  ప్రజలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తూ ఆటంకాలకు గురిచేస్తున్నారన్నారు. పార్టీ ఫండ్ ఇవ్వని వారిని ఇన్ఫార్మర్ లుగా ముద్ర వేసి హత్య చేస్తున్నారన్నారు.