ముంబై: సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం సెషన్లో ఇంట్రాడేలో నష్టాల నుంచి రికవర్ అవ్వగలిగాయి. ఒకానొక దశలో 400 పాయింట్లు వరకు పడిన సెన్సెక్స్, చివరికి12.27 పాయింట్లు తగ్గి 61,223 పాయింట్లు దగ్గర ముగిసింది. నిఫ్టీ 2.05 పాయింట్లు పడి 18,256 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్లో ఏసియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎం అండ్ ఎం, విప్రో, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మరోవైపు టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. సెన్సెక్స్లోని 18 షేర్లు నష్టాల్లో క్లోజవ్వగా, 12 షేర్లు లాభపడ్డాయి. ‘గ్లోబల్ మార్కెట్లు నెగెటివ్లో ట్రేడవ్వడంతో దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. ఐటీ, రియల్టీ, హెల్త్కేర్ షేర్లు పెరగడంతో చివరికి నష్టాలను తగ్గించుకొని ఫ్లాట్గా క్లోజయ్యాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ‘ఈ ఏడాది మార్చిలో వడ్డీ రేట్ల పెంపు ఉంటుందనే సంకేతాలను ఫెడ్ ఇవ్వడంతో గ్లోబల్గా మార్కెట్లు పడ్డాయని చెప్పారు. యూఎస్ ఇన్ఫ్లేషన్ 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో కూడా గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయని చెప్పారు. కాగా, ఈ వారంలో సెన్సెక్స్ 1,478 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 443 పాయింట్లు ఎగిసింది. సెక్టార్ల పరంగా చూస్తే, బీఎస్ఈ టెలికం, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్, ఆటో, బ్యాంకెక్స్ ఇండెక్స్లు 1.20 శాతం వరకు నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఇండస్ట్రీయల్స్, ఐటీ ఇండెక్స్లు లాభాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 0.50 శాతం వరకు లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 25 పైసలు తగ్గి 74.15 వద్ద సెటిలయ్యింది.
నష్టాల్లో ప్రారంభమై.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
- దేశం
- January 15, 2022
లేటెస్ట్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- బీజేపీకి ఓటేయాలనందుకు దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులు
- లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నయ్ : డీజీపీ రవిగుప్తా
- బాధ్యత అంటే ఇదీ : పెళ్లి బట్టల్లో ఓటు వేసిన పెళ్లి కొడుకు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల
- Lok Sabha 2024 Elections: ఓటు హక్కును వినియోగించుకున్న సినీ సెలబ్రేటీలు..ఎవరెవరు ఎక్కడ వేశారంటే?
- ఓటు వేస్తూ వీడియో తీసిన ఓటర్ : పోలింగ్ బూత్ లో గొడవ
- పిఠాపురంలో ఎర్ర కండువా వేసుకుని బూత్ వద్దకు వచ్చిన వ్యక్తి... అభ్యంతరం చెప్పిన వంగా గీత
- V6 DIGITAL 13.05.2024 AFTERNOON EDITION
Most Read News
- అలర్ట్.. హైదరాబాద్లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- రూ. 7 లక్షల రేంజ్ లో 25 కి.మీ. మైలేజ్ అందించే కార్లు
- Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను?
- Kamal Haasan Look From Kalki: కల్కి నుండి లీకైన కమల్ హాసన్ లుక్.. వైరల్ అవుతున్న ఫోటో
- గంగా సప్తమి ఎప్పుడు.. ఆరోజున ఏంచేయాలో తెలుసా..
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్ రోజు ఆగమాగమే..
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- బిగ్ అలెర్ట్.. హైదరాబాద్లో కాసేపట్లో భారీ వర్షం.