న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) బుధవారం 2.5 కోట్ల వెహికల్స్ ప్రొడక్షన్ మైలురాయిని చేరుకుంది. ఈ కంపెనీ డిసెంబర్ 1983లో ప్రొడక్షన్ని ప్రారంభించింది. మరుసటి ఏడాదే 10 లక్షల ప్రొడక్షన్ మార్కును దాటింది. ఇది మార్చి 2011లో -కోటి మార్కును, జూలై 2018లో రెండు -కోట్ల మైలురాయిని దాటింది. దీని మొదటి ప్రొడక్షన్ సెంటర్ హర్యానాలోని గురుగ్రామ్లో ప్రారంభమైంది. కంపెనీకి ఇప్పుడు హర్యానాలోని గురుగ్రామ్ మనేసర్లో రెండు ప్లాంట్లు ఉన్నాయి.
వీటి ప్రొడక్షన్ సామర్థ్యం సంవత్సరానికి 15 లక్షల యూనిట్లు. కంపెనీ దేశీయ మార్కెట్లో 16 ప్యాసింజర్ వెహికల్స్ను విక్రయిస్తోంది. దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోంది. " భారతదేశ ప్రజలతో సుజుకి భాగస్వామ్యానికి 40 సంవత్సరాలు నిండాయి. ఈ సంవత్సరం 25 మిలియన్ల ప్రొడక్షన్ మైలురాయిని దాటడం సంతోషంగా ఉంది. ఇండియాతో మా కమిట్మెంట్కు, భాగస్వామ్యానికి ఇది నిదర్శనం" అని ఎంఎస్ఐ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ హిసాషి టేకుచి తెలిపారు. ప్యాసింజర్ వెహికల్స్కు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, హర్యానాలోని ఖర్ఖోడాలో కొత్త ప్లాంటును నిర్మిస్తున్నామని వెల్లడించారు.