
- ఓడిపోయిన కార్పొరేటర్ల జట్టు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్లో భాగంగా ఆదివారం నాగోల్ బండ్లగూడలోని బల్దియా స్టేడియంలో కార్పొరేటర్లు, మీడియా టీమ్ల మధ్య నిర్వహించిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో జీహెచ్ఎంసీ మీడియా జట్టు 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచిన మీడియా టీమ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.14 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగుల లక్ష్యాన్ని కార్పొరేటర్ల టీమ్ ముందంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కార్పొరేటర్ల టీమ్ 14 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మీడియా టీమ్ లో సదానంద్ గౌడ్, శ్రవణ్, రత్నకుమార్, రాజేందర్ గౌడ్ ప్రతిభ చూపి జట్టుకి భారీ స్కోర్ అందించారు. కార్పొరేటర్ల టీమ్ లో లచ్చిరెడ్డి, దర్శన్, శ్రవణ్, విజయ్ కుమార్ రాణించినా విజయాన్ని అందించలేకపోయారు. మీడియా టీమ్బౌలర్లు సదానంద్, మంచె మహేశ్, శ్రవణ్, రత్నకుమార్, రాజేందర్ గౌడ్ , మల్లం వెంకటేశ్ అద్భుతమైన బౌలింగ్ తో టీమ్ ని గెలిపించారు. మీడియా టీమ్ ఫీల్డింగ్ లోనూ అదరగొట్టింది. కార్పొరేటర్లు దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, శ్రవణ్, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మీడియా టీమ్ను అభినందించారు.