కాల్పుల ఘ‌ట‌న‌పై మ‌జ్లిస్ సీరియ‌స్ .. ఆదిలాబాద్ ఎంఐఎం శాఖ రద్దు

కాల్పుల ఘ‌ట‌న‌పై మ‌జ్లిస్ సీరియ‌స్ .. ఆదిలాబాద్ ఎంఐఎం శాఖ రద్దు

ఆదిలాబాద్ కాల్పుల ఘటనపై ఎంఐఎం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఆ జిల్లా ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు ప్ర‌క‌టించింది. పాత శాఖ స్థానంలో త్వరలోనే కొత్త ఎంఐఎం శాఖను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్ ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఇద్దరిపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న మజ్లిస్ అధినాయకత్వం ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కాల్పులకు పాల్పడిన ఫారుఖ్‌ను పార్టీ నుంచి తొలగించామని అసదుద్దీన్‌ ప్రకటించారు.

శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ (48) ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డాడు. క‌త్తుల‌తో దాడి చేశాడు. ఈ దాడిలో మన్నన్‌ (52), అతడి కుమారుడు మోథెషిన్‌ (20), జమీర్‌ (55) అనే ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఫారూఖ్‌ అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తుపాకీని స్వాధీనం చేసుకుని ఆయుధాల చట్టం 307, 327 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.