MIM పార్టీ TRS ప్రభుత్వాన్ని నడిపిస్తోంది: ఎంపీ అర్వింద్

MIM పార్టీ TRS ప్రభుత్వాన్ని నడిపిస్తోంది: ఎంపీ అర్వింద్

CAA , ANRCలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదని.. వాటి అమలు కచ్చితంగా జరగుతుందన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. ఈ రెండింటినీ కాంగ్రెస్, ఎంఐఎంలు  కావాలనే వ్యతరేకిస్తున్నాయన్నారు. మరోవైపు..TRS ప్రభుత్వాన్నిMIM నడిపిస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్ కు  అసుదుద్దీన్ ఓవైసీ పెద్దకొడుకుగా మారాడన్నారు అర్వింద్. తన పూర్వీకుల వివరాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే అసదుద్దీన్ ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే.. నిజామాబాద్ లో MIM సభ పెట్టిందన్నారు. ‘జనగణమన’ పాడని అసదుద్దీన్ సెక్యులరిజంపై మాట్లాడటం సమంజసం కాదన్నారు. అభివృద్ధిని చూసి మైనార్టీలు ఓటు వేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో TRS, MIM పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు ఎంపీ అర్వింద్.