బీజేపీలోకి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు 

బీజేపీలోకి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు 

ఢిల్లీ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రదీప్ రావు వెంట తరుణ్ చుగ్, గరికపాటి మోహన్ రావు కూడా ఉన్నారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వీటి విజయ్ కుమార్, యోగనంద్ కొల్లూరు కూడా బీజేపీలో చేరారు. 


రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని ప్రదీప్ రావు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ బలంగా ఉందని, అధికారంలోకి వచ్చేందుకు మంచి అవకాశం ఉందన్నారు.