అంకాపూర్ గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

అంకాపూర్ గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

భూమిలేని ప్రతి పేదవారికి బతుకుదెరువు చూపిస్తానన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లా వీణ వంక మండలం వల్బాపూర్ గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన ఈటెల..వ్యవసాయం దండుగ కాదు బతుకు భరోసా అనే నమ్మకం.. ఈ వేదికలు కలిగించాలన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత వేసుకున్న పంట పండుతుందనే భరోసా వచ్చిందన్నారు. త్వరలోనే 50 వేల బర్రెలు అందిస్తామన్నారు. వ్యవసాయంలో కూలి పనులు తగ్గిపోయాయని.. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం మార్గాలు చూడాలన్నారు. నియోజకవర్గంలో భర్త చనిపోయి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామన్నారు. నిజామాబాద్ లోని అంకాపూర్ గ్రామాన్ని రైతు ఐక్యతకు గొప్ప ఉదాహరణ అని..అందరూ ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు.