మిస్సింగ్ కేసును 12 గంటలు ఛేదించిన నగర పోలీసులు

మిస్సింగ్ కేసును 12 గంటలు ఛేదించిన నగర పోలీసులు

హైదరాబాద్ అబిడ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కేసును 12గంటల్లో ఛేదించారు పోలీసులు. మురళీధర్ బాగ్ లో ఈ నెల 5న ఆడుకుంటామని ఇంటి నుంచి వెళ్ళిన పదేళ్ళ చరణ్ కుమార్, 8 ఏళ్ళ వినయ్ కుమార్ లు కనిపించకుండా పోయారు. దీంతో చిన్నారుల మేనమామ శ్రీనివాస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజ్ ఆదారంగా గాలింపు చేపట్టారు.

బస్సులో మారేడ్ పల్లికి వెళ్లినట్లు గ్రహించిన పోలీసులు..మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ లో పిల్లలున్నట్లు గుర్తించారు. కేసును 12గంటల్లో చేధించి, పిల్లలను క్షేమంగా తమకు అప్పగించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు కుటుంబసభ్యులు.