బీజేపీ కార్పొరేట్ పార్టీ అని.. TRS పేదల పార్టీ

బీజేపీ కార్పొరేట్ పార్టీ అని.. TRS పేదల పార్టీ

దళిత బంధు అమలు చేయకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు మంత్రి హరీశ్ రావు. ప్రతి ఇంటికి బంధు ఇస్తామన్నారు. దళితబంధుపై ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మెద్దన్నారు. దళితులు ఎదగాలన్నాదే సీఎం సంకల్పం అన్నారు. మరో రెండు తామే అధికారంలో ఉంటామని.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. బీజేపీ కార్పొరేట్ పార్టీ అని... TRS పేదల పార్టీ అన్నారు.  కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు, వీణవంక, సిరిసేడులో జరిగిన ప్రచారంలో హరీశ్ మాట్లాడారు.

గొల్లకురుమలకు గొర్లతో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఇచ్చి రాజ్యాధికారమే చేతిలోపెట్టామన్నారు . మంత్రిగా ఉండి రూపాయి పని చేయని ఈటల.... ఎమ్మెల్యే అయ్యి చేసేదేమి లేదన్నారు. బీజీపీ పాలిత రాష్ట్రాల్లో వడ్లు కొనడం లేదని...మన రాష్ట్రంలో కొంటుందో లేదో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. గెల్లుని గెలిపిస్తే చల్లూరుని మండలంగా చేస్తామన్నారు.