నర్సాపూర్ మంత్రుల సభలో నోట్ల వర్షం

నర్సాపూర్ మంత్రుల సభలో నోట్ల వర్షం
  • మున్సిపల్​ చైర్మన్​ డ్యాన్స్​ చేస్తుంటే 500 నోట్లు వెదజల్లిన్రు
  • నర్సాపూర్​లో టీఆర్ఎస్​ లీడర్​ జోష్​

నర్సాపూర్, వెలుగు: మంత్రులు పాల్గొన్న సభలో ఓ టీఆర్ఎస్​ లీడర్​ నోట్ల వర్షం కురిపించాడు. బుధవారం మెదక్​ జిల్లా నర్సాపూర్​లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్​డిపోను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు, రవాణా శాఖ  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. సభ నిర్వహించగా, స్టేజీ మీద గాయకుడు సాయి చంద్​పాట పాడారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ​మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ డ్యాన్స్​చేశారు. దీంతో నర్సాపూర్ కు చెందిన టీఆర్ఎస్ లీడర్​ శ్రీధర్ గుప్తా రూ.500 నోట్లను సాయిచంద్, మురళీయాదవ్​లపై చల్లాడు. దాదాపు రూ.50 వేల వరకు ఇలా  నోట్లను వెదజల్లడంతో స్టేజీ మీదున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. అయితే ఈ డబ్బులను అక్కడే ఉన్న టీఆర్ఎస్​ కార్యకర్తలు తీసుకొని జేబులో పెట్టుకోవడం విశేషం.