నుమాయిష్లో షాపింగ్ అనుభూతి అపూర్వం : మంత్రి హరీశ్ రావు

నుమాయిష్లో షాపింగ్ అనుభూతి అపూర్వం : మంత్రి హరీశ్ రావు

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా చాలామంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. 1938 సంవత్సరంలో హైదరాబాద్ లో ప్రారంభమైన నుమాయిష్ కు యావత్ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉందని తెలిపారు. 82వ సంవత్సరం నాంపల్లి నుమాయిష్ ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. జమ్మూకశ్మీర్ మొదలుకొని ఎన్నో రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఈ ఎగ్జిబిషన్ కు వచ్చి స్టాల్స్ పెట్టుకుంటరని చెప్పారు.

ఫోన్ లో క్లిక్ చేసి, మొబైల్ లో ఆర్డర్స్ పెట్టే దానితో  పోలిస్తే.. నుమాయిష్ లో నేరుగా షాపింగ్ చేయడం ద్వారా పొందే అనుభూతి అపూర్వంగా ఉంటుందన్నారు. గతంలో ఎగ్జిబిషన్ ప్రారంభం అయిన వారం రోజుల వరకు షాపులు వచ్చేవి కావని.. ఇప్పుడు మొదటి రోజే షాపులు ఫుల్ అయ్యాయని చెప్పారు. ప్రజలు ఎగ్జిబిషన్ కు రావడానికి ప్రత్యేక  ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ కు వచ్చేందుకు బస్సుల సంఖ్యను కూడా పెంచుతామని తెలిపారు.