ట్రాన్స్ జెండర్ల సమస్యలను పరిష్కరిస్తాం

ట్రాన్స్ జెండర్ల సమస్యలను పరిష్కరిస్తాం

ట్రాన్స్ జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్యం, ఉపాధి, ఇతర అవకాశాల విషయంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఈ విషయంలో ట్రాన్స్ జెండర్లు అన్ని విధాలా అర్హులని చెప్పారు. గురువారం మంత్రి హరీశ్ రావును ట్రాన్స్ జెండర్లు కలిసి వారి సమస్యల గురించి వివరించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు అధ్యయనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్ల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని నివేదిక అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ ను ఆదేశించారు. సీఎం కేసీఆర్ కి తెలియజేసి, కేబినెట్ ద్వారా ట్రాన్స్ జెండర్లకు ఆరోగ్యం, విద్య, ఉపాధి, ఇతర సంక్షేమ పథకాల్లో ప్రయోజనం చేకూర్చేలా చూస్తామన్నారు.