కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి: మంత్రి హరీష్ రావు

కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి: మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండాలో గిరిజనుల దైవం మోతీమాత జాతర జరుగుతోంది. ఈ జాతరలో హరీష్ రావు పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని.. ఇక ముందు కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు వారి రాష్ట్రాల్లో ఉన్నాయో? లేవో?.. మూడు రాష్ట్రాల నుండి ఈ జాతరకు వస్తున్న భక్తులను అడగండి అని హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని..దీంతో ఎంబీబీఎస్ లో గిరిజన విద్యార్థులకు సీట్లు లభించాయని చెప్పారు. గిరిజనులు తమ పిల్లలను చదివించాలని సూచించారు. మీ పిల్లలకు బాల్య వివాహాలు చేయెదని కోరారు. మీ పిల్లల్ని మీరు చదివించలేక పోతో మాకు అప్పచెప్పండి.. మేము చదివిస్తామని మంత్రి కోరారు. గిరిజన హాస్పిటల్లను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని హరీష్ రావు పేర్కొన్నారు.