మంత్రి పువ్వాడ కాన్వాయ్ కు ప్రమాదం

మంత్రి పువ్వాడ కాన్వాయ్ కు ప్రమాదం

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు  త్రుటిలో ప్రమాదం తప్పింది. పంజాగుట్టలోని వెంగల్ రావు పార్క్ సమీపంలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ లోని మూడు వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు బంజారహిల్స్ పోలీసులు.