బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ ఖైర‌తాబాద్‌లో బైక్ ర్యాలీ

బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ ఖైర‌తాబాద్‌లో బైక్ ర్యాలీ

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. రైతులకు మద్దతుగా మంగ‌ళ‌వారం జరగబోయే భారత్ బంద్ కి సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మద్దతు ఇవ్వడంతో బంద్ ని విజయవంతం చేయాలని కోరుతూ త‌న నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముక అని చెప్పబ‌డే రైతులు దేశ రాజధాని ఢిల్లీ లో 13 రోజులుగా ధర్నా చేస్తున్నారని, టి.ఆర్.ఎస్. పార్టీ వారికి మద్దతు తెలుపుతుందని, ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని అన్నారు.

రైతులను గోసపుచ్చుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించినట్టు చరిత్రలో లేదన్న దానం… రైతులు అడుగుతున్నట్టు వారికి మద్దతు ధర ఇస్తామని లిఖితపూర్వకంగా అభయం ఇవ్వాలన్నారు. రైతులు ఇబ్బందిలో ఉన్నప్పుడు వారికి అండగా మేము కూడా ఉన్నాం అని చెప్పడానికి బంద్ కి మద్దతు తెలుపుతున్నామ‌న్నారు. రైతు కు మద్దతుగా రేపు 10 నుంచి 12 గంటల వరకు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు ఆటో బస్ మెట్రో రైలు వంటి రవాణా సౌకర్యాలు కూడా బందులో పాల్గొంటున్నాయని అన్నారు.