
ముషీరాబాద్, వెలుగు : రాష్ట్ర మత్స్య శాఖలో పనిచేస్తున్న 177 మంది ఒప్పంద ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్, ఫిషరీస్ అసిస్టెంట్, ఫిషర్మెన్ పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేశారని గుర్తుచేశారు.
మత్స్య సహకార సంఘాల సభ్యులు, 38 లక్షల మత్స్యకారుల కుటుంబాలు, 4 వేల మంది మత్స్య రైతులను తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. చేపల ఉత్పత్తి ద్వారా మత్స్య సంపద సృష్టించడంలో కీలక భూమిక పోషించిన వీరిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు. అందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని లేఖలో కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.