ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్కు నాంపల్లి 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు కొన్ని షరుతులు విధించింది. నందకుమార్ హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అలాగే రూ. 10 వేల పూచీకత్తును సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం బెయిల్ మంజూరుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత నందకుమార్కు చంచల్ గూడ జైల్ నుండి విడుదలయ్యారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న నందకుమార్, రామచంద్రభారతి, సింహాయాజీలకు ఇప్పటికే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో కేసులో నందకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నందకుమార్కు తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.