హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రండి

హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రండి

హైదరాబాద్ : జంట నగరాల అభివృద్ధిని తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ తో చర్చకు సిద్ధమని ప్రకటించారు. బాలానగర్, ఇందిరానగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఇందిరానగర్ లో మూడు తరాలుగా నివసిస్తున్న వారికి సైతం ఇప్పటికీ ఇంటి నెంబర్లు కేటాయించకపోవడాన్ని రఘునందన్ తప్పుబట్టారు. లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాట తప్పారని విమర్శించారు. మంత్రి కేటీఆర్ బస్తీల్లో పర్యటిస్తే అక్కడ నివసించే వారి బాధలు తెలుస్తాయని రఘునందన్ సూచించారు.