హైదరాబాద్: రాష్ట్రంలో అభివృద్ధి లేదని తెలిసే సీఎం కేసీఆర్ గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే రాజాసింగ్. కేసీఆర్కు మెంటల్ ఎక్కిందన్న రాజాసింగ్.. మెంటల్ హాస్పిటల్కు వెళ్ళమని కేసీఆర్ కు గతంలో చాలా సార్లు చెప్పానన్నారు. మా వద్దకు వచ్చినా మేము తీసుకెళ్తామని... ప్రధాని మోడీ చూస్తే కేసీఆర్కు పిచ్చి ఎక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా చేసిన పనులు గవర్నర్ ప్రసంగం ద్వారా చెబుతారు కానీ.. సంవత్సరం నుంచి చేసిందేమీ లేనందుకే గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు. మహిళ అని చూడకుండా గవర్నర్ను అవమానిస్తారా అని ప్రశ్నించారు. రాజ్యాంగ పదవీని అవమాన పరుస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ సీరియస్ అయ్యారు.
మరిన్ని వార్తల కోసం: