హైదరాబాద్: సెక్రటేరియట్లో ఉన్న అమ్మవారి గుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. “ఆ గుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదు,TDP ప్రభుత్వం కట్టలేదు.. నిజాం కాలం నాటి గుడి అని లోకల్ వాళ్ళు చెబుతున్నారు. గుడి మీకు ఎందుకు అడ్డం వచ్చింది? ఎందుకు డ్యామేజ్ చేశారు? “అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
“కేసీఆర్ .. మీకు దేవుడి మీద నమ్మకం ఉందో నాకు తెలియదు. అప్పుడప్పుడు మొక్కులు తీర్చడం, యాగాలు చేయడం చేస్తుంటారు. అది కూడా ప్రజల కోసం కాదు.. మీ కోసమని అందరికి తెలుసు. గుళ్ళు పడగొట్టొద్దనీ, గుళ్ళు కూల్చి వేస్తే మనం సర్వ నాశనం అవుతామని పెద్దలు, మన పూర్వీకులు చెప్పేవారు. ఆ గుడి ప్లేస్ లోనే మళ్లీ గుడి కట్టించండి.. లేదంటే నిజాం కు పట్టిన పరిస్థితే మీకూ రావొచ్చు. ఆలోచన చేసుకోండి” అని అన్నారు.