రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్

రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్

రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించడం.. కరోనా కేసుల పెరగడం దృష్ట్యా బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూసివేస్తున్నట్లు తెలంగాణ మూవీ థియేటర్స్ అసోసియేషన్ ప్రకటించింది. కోవిడ్ ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం పరిగణణలోకి తీసుకొని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం రాత్రి 9 గంటల  నుంచి  మే1 ఉదయం 5 గంటల వరకు అమలలో ఉండనుంది.