గండిపేట, వెలుగు: ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే లోక్ సభ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాయని.. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్అన్నారు. సోమవారం బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధి హైదర్ షా కోట్ మైత్రివనంలో బీజేపీ చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్ స్థాయి ‘గావ్ చలో.. ఘర్ చలో’ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చీఫ్ గెస్టుగా హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని.. మోదీ మళ్లీ ప్రధాని అవుతారన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించేందుకు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, కసిరెడ్డి భాస్కర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, శ్రీధర్, సామ రంగారెడ్డి, సునీత, బొక్క నర్సింహ్మరెడ్డి, మహేశ్ యాదవ్ పాల్గొన్నారు.