రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ గెలిచాక కేసీఆర్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని అన్నారు. ఇదే సమయంలో బీజేపీ, వెూడీ గ్రాఫ్ వేగంగా పెరుగుతోందన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపబోవన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ బలంమేంటో నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వార్డుల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరిగాయన్నలక్ష్మణ్… గతంలో కేసీఆర్ను సమర్థించిన కార్మికులు, ఉద్యోగులు.. ఇప్పుడు ఆయనకు దూరమవుతున్నారన్నారు.