
మలయాళంలో ఫిబ్రవరి 22న విడుదలైన మంజుమెల్ బాయ్స్ సుమారు రూ.5 కోట్ల బడ్జెట్తో రూపొంది దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డ్ స్పృష్టించింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొడువల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్ ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు.
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు..టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్, సుకుమార్ రైటింగ్స్ రీలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ వచ్చే నెల ఏప్రిల్ 6న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో..అదే టైటిల్తో (మంజుమెల్ బాయ్స్) రిలీజ్ చేస్తున్నారు.
Also Read: ఫ్యామిలీతో కలిసి తిరుమలకు రామ్ చరణ్
లేటెస్ట్గా మేకర్స్ ఈ న్యూస్ ని సోషల్ మీడియాలో ప్రకటించడంతో తెలుగు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. రీసెంట్ గా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ప్రేమలు సినిమాని రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. దీంతో అదే సమయంలో మలయాళంలో ట్రెండ్ అవుతున్న మంజుమెల్ బాయ్స్ ని రిలీజ్ చేస్తున్నారు.ఈ మూవీకి సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు.
??? ??????? ???????? ????????? ???? - #ManjummelBoys is now coming to ????????? ??? ?????? ???????? ❤️?
— Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2024
Grand release worldwide on April 6th.
Telugu release by @MythriOfficial, @Primeshowtweets & @SukumarWritings ✨… pic.twitter.com/xDULaAgbVx
మంజుమెల్ బాయ్స్ కథ విషయానికి వస్తే..
కొందరు స్నేహితుల అంతా కలిసి తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్లోని గుణ గుహలకు ట్రిప్ కు వెళతారు. ఆ సమయంలో ఆ గ్యాంగ్లోని ఓ యువకుడు అనుకోకుండా ప్రమాదంలో పడతాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో ఆ గ్రూప్లోని స్నేహితులకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యానేదే మంజుమెల్ బాయ్స్ లో ఆద్యంతం థ్రిల్లింగ్గా ఉత్కంఠభరితంగా చూపించారు మేకర్స్.