ఫ్యామిలీతో కలిసి తిరుమలకు రామ్ చరణ్

ఫ్యామిలీతో కలిసి తిరుమలకు రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిచుకోనున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట  విమానాశ్రయానికి చేరుకున్నారు. తమ అభిమాను హీరో వస్తున్న విషయం తెలుకున్న మెగా ఫ్యాన్స్  ఎయిర్ పోర్టు్కు దగ్గరుకు తరలివచ్చారు. కేరింతలు కొడుతూ  రామ్ చరణ్ కు ఘనంగా స్వాగతం పలికారు అభిమానులు. ఉత్సాహంతో రామ్ చరణ్ తో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు.ఇక,  విమానాశ్రయం నుంచి రామ్ చరణ్ ఫ్యామిలీ రోడ్డు మార్గంలో తిరుమలకు బయల్దేరి వెళ్లారు.

కాగా, మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు ఫ్యామిలీతో కలిసి వచ్చారు. తమతోపాటు తన కూతురు క్లిన్ కారను కూడా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున వీఐపీ దర్శనం చేసుకోనున్నట్లు సమాచారం.