టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా  నందమూరి సుహాసిని

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా  నందమూరి సుహాసిని

హైదరాబాద్‌, వెలుగు: టీడీపీ తెలంగాణ రాష్ట్ర క‌మిటీ విస్తరణ‌లో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మరో ముగ్గురికి చోటు కల్పించారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని (కూకట్​పల్లి నియోజక వర్గం), రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్ నాయుడు (కొల్లాపూర్ నియోజకవర్గం), రాష్ట్ర కార్యదర్శిగా బి.విఠల్ (బాన్సువాడ నియోజకవర్గం)ను నియమించారు.

తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా షకీలా రెడ్డి (ఖైర తాబాద్ నియోజకవర్గం), జహీరాబా ద్ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలోని బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్​గా కరాటే రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధ‌వారం కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియామక ఉత్తర్వులు  జారీ చేశారు.