మినిస్టర్ ప్రోగ్రామ్కు పిలవలేదని ఎంపీటీసీ నిరసన

మినిస్టర్ ప్రోగ్రామ్కు పిలవలేదని ఎంపీటీసీ నిరసన

ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు ఇటీవల కొండపోచమ్మ సాగర్ లో నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తనను ఎందుకు పిలువలేదంటూ మెదక్​ జిల్లా నిజాంపేట్ మండలం నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి లోకల్ లీడర్లను ప్రశ్నించారు. ఇవాళ జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో ఆయన కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

‘నేను ఎమ్మెల్సీ మనిషిని.. నీకు ఎందుకు చెప్పాలని' ఇతర నాయకులు అన్నారని ఎంపీపీ సిద్ధరాములు ఆరోపించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి కలిసి కార్యక్రమాలకు హాజరుకావడం లోకల్​ లీడర్లకు ఇష్టం లేదా? అని ఆయన ప్రశ్నించారు. తనకు సరైన సమాధానం చెప్పేదాకా జనరల్ బాడీ మీటింగ్ కు హాజరుకానని ఆఫీస్ ఎదుట కూర్చుని ఎంపీటీసీ నిరసన వ్యక్తం చేశారు.