రాష్ట్రంలో మరో 2,296 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో మరో 2,296 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,296 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,77,070 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1062కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,062 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,46,135గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,873 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 23,527 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. మంగళవారం 55,892 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 26,28,897 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా మరియు రికవరీ రేటు 82.52 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 321, రంగారెడ్డి 217, మేడ్చల్ 173, నల్గొండ 155, కరీంనగర్ 136, వరంగల్ అర్బన్ 99, సిద్ధిపేట్ 92, నిజామాబాద్ 82, భద్రాద్రి 77, కామారెడ్డి 77, సూర్యపేట్ 73, మహబూబా బాద్ 72, ఖమ్మం 69, సిరిసిల్ల 67, జగిత్యాల 50 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

అప్పులకు వడ్డీలు కట్టేందుకే ఎల్ఆర్ఎస్ ఫీజులు

నీటిని తరలించేందుకు స్పీడ్ పెంచిన ఏపీ

ఎన్నికల కసరత్తు షురూ చేసిన బల్దియా