తెలంగాణలో కొత్తగా 862 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 862 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 862 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,66,904 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి ముగ్గురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,444కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 961 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,54,676గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,784 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 8,507 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. బుధవారం 41,101 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 52,89,908 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా మరియు రికవరీ రేటు 95.41 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 164, మేడ్చల్ 91, ఖమ్మం 63, రంగారెడ్డి 57, భద్రాది 53, కరీంనగర్ 38, పెద్దపల్లి 37, నల్గొండ 35, వరంగల్ అర్బన్ 33 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

21 ఏండ్లలో ఒక్క ప్రమోషన్‍ ఇయ్యలె.. రిటైర్మెంటప్పుడు కూడా అదే పోస్ట్ , అదే జీతం

పరీక్ష హాల్‌లోకి రానీయలేదని స్టూడెంట్​ సూసైడ్