మమతా బెనర్జీ సర్కారుకు షాక్

మమతా బెనర్జీ సర్కారుకు షాక్

బెంగాల్లోని మమతా బెనర్జీ సర్కారుకు షాక్ తగిలింది. బెంగాల్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ 3,500 కోట్ల జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణపై బెంగాల్  సత్వర చర్యలు చేపట్టాలని, ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే అదనపు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 2022- 23 రాష్ట్ర బడ్జెట్  ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలకు 12 వేల 819కోట్లు ఖర్చు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ.. మురుగు, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు బెంగాల్  సర్కారు ప్రాధాన్యమివ్వలేదని ట్రైబ్యునల్  అసహనం వ్యక్తం చేసింది.

ప్రజలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించడంలో స్థానిక సంస్థలు, రాష్ట్రాల రాజ్యాంగ బాధ్యత అని విమర్శించింది. నిధుల కొరత ఉందని ప్రజలకు జీవించే హక్కును తిరస్కరించవద్దంది. కేంద్ర నిధుల కొరత కోసం ఎదురుచూస్తూ రాష్ట్రాలు తమ బాధ్యతలను ఆలస్యం చేయవద్దని తెలిపింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని... నిబంధనలు ఉల్లంఘించినందుకు పరిహారం చెల్లించాల్సిందనే NGT స్పష్టం చేసింది.