బీజేపీ హామీల్లో 56 శాతం అబద్ధాలే

బీజేపీ హామీల్లో 56 శాతం అబద్ధాలే

కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ అంతా ఉత్తదేనన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. అధికారాల్లో ఉన్నా రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారన్నారు.   కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు రూ.15 వేలు ఎందుకివ్వరని ప్రశ్నించారు. పంజాబ్ మేనిఫేస్టోలో అమలు కానీ హామీలు ఇచ్చారన్నారు. హామీలు అమలు చేయకపోవడంతోనే పంజాబ్ లో కాంగ్రెస్ ను ఓడగొట్టారన్నారు.  రైతు బీమా ఆల్రెడీ అమలు చేస్తున్నామన్నారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకివ్వరని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీల్లో అబద్ధాలే ఎక్కువని సర్వేలు చెబుతున్నాయన్నారు.  బీజేపీ హామీల్లో 56 శాతం అబద్ధాలేనని సర్వేలు చెబుతున్నాయన్నారు. రైతు డిక్లరేషన్ పేరుతో కొత్త మోసాలకు తెరలేపుతున్నారన్నారు. ఆపద నుంచి బయటపడటానికే కాంగ్రెస్  హామీలు ఇస్తుందన్నారు. గతంలో రూ.2లక్షల రుణామాఫీ హామీ ఇచ్చినా  ప్రజలు తిరస్కరించారన్నారు.