అరుణాచల్ ప్రదేశ్లోని ఏకైక జేడీయూ ఎమ్మెల్యే టెకీ కాసో బీజేపీలో చేరారు. నిన్న (గురువారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన తన మద్దతుదారులతో కలిసి అధికారికంగా పార్టీలో చేరారు. కాసో చేరికతో బీజేపీ బలం 49కి చేరింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 15 స్థానాల్లో ఏడు స్థానాలను కైవసం చేసుకొని బీజేపీ తర్వాత రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
అయితే గత డిసెంబర్ లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. మొత్తం 60 మంది సభ్యులున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 41 స్థానాలను బీజేపీ గెలుచుకొని అధికారాన్ని చేపట్టింది. టెకీ కాసో ఇటానగర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
अरुणाचल प्रदेश के वरिष्ठ नेता श्री टेची कासो जी, जिला परिषद अध्यक्षों, जिला परिषद सदस्यों व पार्षद सदस्यों का भारतीय जनता पार्टी परिवार में स्वागत है।
— Jagat Prakash Nadda (@JPNadda) August 25, 2022
मुझे विश्वास है कि आपके साथ आने से संगठन को और मजबूती मिलेगी। pic.twitter.com/7FTbABJpSh