ఏపీతోనే కాదు.. అవసరమైతే దేవుడితో కొట్లాడతాం

ఏపీతోనే కాదు.. అవసరమైతే దేవుడితో కొట్లాడతాం
  • హక్కు నీటి కోసం ఎంతవరకైనా వెళతాం మంత్రి కేటీఆర్
     

నారాయణపేట: మన వాటా హక్కు నీటి కోసం ఎంతవరకైనా పోరాడేందు సిద్ధమని.. అక్రమ ప్రాజెక్టులు కడుతూ అన్యాయం తలపెడుతున్న ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం జిల్లాలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. జల వివాదాలపై ఇప్పటి వరకు పెదవి విప్పని ఆయన నారాయణపేట జిల్లాలో తొలిసారిగా స్పందించి మాట్లాడారు. పాలమూరులో కష్టపడే తత్వం ఉన్న మనుషులు ప్రతి ఇంట్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జలాలు రావాలే... మా ప్రాంతం సస్యశ్యామలం కావాలన్న ప్రజల ఆకాంక్షను తప్పక నెరవేరుస్తామన్నారు. పాలమూరు జిల్లాలోని ప్రతి పల్లెను సస్యశ్యామలం చేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కొట్లాడతాం.. తప్పకుండా పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత కేసీఆర్ నాయకత్వంలోని  తెలంగాణ ప్రభుత్వానిదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.