మల్లారెడ్డి వర్శిటీ ముందు ఉద్రిక్తత.. భారీగా ట్రాఫిక్ జామ్

మల్లారెడ్డి వర్శిటీ ముందు ఉద్రిక్తత.. భారీగా ట్రాఫిక్ జామ్

కుత్బుల్లాపూర్: మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు.  గత కొద్ది రోజులుగా నాణ్యత లేని ఆహారం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాలేజ్ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి సమాధానం చెప్పాలని NSUI కార్యకర్తలు,విద్యార్థులు.. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ ముందు విద్యార్థులు భారీగా చేరుకోవడంతో  రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

హాస్టల్ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయని చెప్తున్నా పట్టించుకోకుండా  కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేడీస్ హాస్టల్ లో మగవాళ్లను సెక్యూరిటీ గార్డులుగా  పెట్టీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.లక్షలాది రూపాయలు  వసూలుచేస్తున్న మల్లారెడ్డి వర్శిటీ యాజమాన్యం నాణ్యమైన విద్య,భోజనం అందించకుండా విద్యార్తులను వేధిస్తున్నారని ఆరోపించారు.  భోజనం సరిగ్గా లేక స్టూడెంట్స్ అస్వస్థతకు గురైన విషయం బయటకు తెలియకుండా దాస్తుందని మండిపడ్డారు. 

వర్శిటీ హాస్టల్ లో ఫిబ్రవరి 7న రాత్రి భోజనంలో బొద్దింక, బల్లి పడి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆందోళనకు దిగారు. ఈ విషయం విద్యార్థి సంఘాల నాయకులకు తెలియడంతో  గురువారం  అక్కడి నిరసన తెలిపారు. దీంతో   వర్శిటీ సిబ్బంది వారిపై దాడి చేశారు. ఆ రోజు నుంచి పలు విద్యార్థి సంఘాలు వర్శిటీ ముందు ఆందోళనలు చేస్తున్నాయి