తెలుగు జాతిని గర్వపడేలా చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ఫిల్మ్ నగర్ లో లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిచటంతో తన జన్మ ధన్యమయిందన్నారు. నాయకుడిగా తనను ఎన్టీఆర్ ఎంకరేజ్ చేశారన్నారు. ఎన్టీఆర్ వల్లే ఎంతో మంది నాయకులుగా ఎదిగారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నారన్నారు. హైదరాబాద్ లో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని అన్నారు. విగ్రహావిష్కరణలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, బంధువలు, పలువురు సినీ నిర్మాతలు, పరిటాల సునీత పాల్గొన్నారు.
ఎన్టీఆర్ అనే మూడక్షరాల పేరే త్రిమూర్తులు స్వరూపమని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. శివుడిలా పేదవారి ఉన్నతికి ఎన్నో పథకాలను సృష్టించారన్నారు. ఆయనే ఒక విష్ణుమూర్తి స్వరూపమని.. వారి మనస్తత్వంపై తాను ఓ పుస్తకాన్ని రాస్తానన్నారు. ఎన్టీఆర్ తో తాను చేసిన 16 ఏళ్ల ప్రయాణం, చెప్పిన జీవిత సత్యాలతో పుస్తకం ఉంటుందన్నారు. తమల్ని రచయితలుగా ఎన్టీఆర్ పోత్సహించారన్నారు. పరుచూరి బ్రదర్స్ అని మాకు ఎన్టీఆర్ పేరు పెట్టారన్నారు.